Bharat Today : కామారెడ్డికి చెందిన మాజీ జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ గ్యార లక్ష్మి (47) ఆకస్మికంగా బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. ఆ తీవ్ర విషాద సమయంలోనూ.. కన్నీళ్లను దిగమింగుతూ ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు రావడం ఆదర్శనీయం… అని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ ప్రశంసంచారు. లక్ష్మి కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులను దానం చేసి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నలుగురు పేషెంట్లకు వారు ప్రాణదాతలుగా నిలిచారు. ఆ కుటుంబ సభ్యులకు నా సెల్యూట్. మీలాంటి వారు సమాజంలో ఎంతో మంది ఆదర్శం అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ అన్నారు.



