శివాజీ ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో హీరోయిన్ల డ్రస్సింగ్ పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. కొందరు ఆయన చేసిన కామెంట్స్ చాలా తప్పు అంటూ ఖండించారు. కొందరు మాత్రం శివాజీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ 9 ఫేమ్ దువ్వాడ మాధురి.. శివాజీ చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ చెప్పిన దానిలో ఏ తప్పూ లేదని, అతను మాట్లాడే భాష తప్పని అన్నారు. సామాన్లు అనే పదం వాడకుండా.. చీరలు కట్టుకోమని మంచిగా కూడా చెప్పి ఉండొచ్చన్నారు. హీరోయిన్లకు చెప్పే బదులుగా డైరెక్టర్లు, నిర్మాతలకు ఈ విషయం చెప్పాలని, హీరోయిన్లు వాళ్లు ఎలా చెప్తే అలా నడుచుకుంటారన్నారు. తన దృష్టిలో ఆడవాళ్లకు చీరే అందమన్నారు. అయినా అతను చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పాడని, అంతటితో మ్యాటర్ క్లియర్ అయిందని అన్నారు.
కానీ.. ఈ విషయంపై యాంకర్ అనసూయ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని మాధురి ఫైరయ్యారు. ఆమె మాటలతో ఏకీభవించబోనన్నారు. ఆమె సనాతన ధర్మం, ఆలయాల కోసం మాట్లాడింది అంటే ఇక్కడ నమ్మేవారు ఎవరూ లేరన్నారు. ఆలయాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం మంచిదన్నారు. సనాతన ధర్మం గురించి ఆమెకి ఏం తెలుసని దువ్వాడ మాధురి ప్రశ్నించారు. ఆమె వేసుకునే బికినీలు, బట్టలు ఏవీ తనకు నచ్చవు అని, ఈ విషయంలో తనను ట్రోల్ చేసినా ఏం ఫర్వాలేదని, ట్రోలింగ్స్ తనకేం కొత్త కాదని అన్నారు.



