సైకత శిల్పాన్ని తీర్చిదిద్దుతున్న దేవిన సిస్టర్స్
Bharat Today : రాజధాని_అమరావతి సైకత శిల్పం….. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తీర్మానిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదించిన సందర్భంగా అమరావతి మన రాజధాని అన్న నినాదంతో రూపొందించిన సైకత శిల్పం రూపొందించిన శిల్పి దేవిన శ్రీనివాస్. స్వర్ణాంధ్రప్రదేశ్ కు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ పటం, ఆంధ్రప్రదేశ్ పచ్చగా ప్రకృతితో ఉండాలన్నట్టుగా చుట్టూ మొక్కలు, అభివృద్ధికి సూచికగా బుల్లెట్ ట్రైన్, ఆకాశ హార్మ్యాలు,విమానం, అమరావతికి గుర్తుగా బుద్ధుడు, ముఖ్యంగా అమరావతి రాజధాని కోసం 35 వేల ఎకరాలను ఇచ్చిన రైతులకు గుర్తుగా ఒక రైతును ఈ సైకత శిల్పంలోరూపొందించడం జరిగింది.


