ప్రధాని నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో, కాకతీయ వైభవానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ములుగు జిల్లా పాలంపేటలోని శివాలయం, గొల్లాల గుళ్లను భారత పురావస్తు శాఖ ‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు’గా ప్రకటించింది. ఈ రెండు కట్టడాలతో కలిపి, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం రక్షణలో ఉన్న స్మారక కట్టడాల సంఖ్య 10కి చేరింది. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతో పాటు, ఇప్పుడు ఈ కట్టడాలకు లభించిన జాతీయ హోదా, మన పురాతన సంపదను భావి తరాలకు అందించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న గొప్ప చర్యగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ వారసత్వానికి జాతీయ గుర్తింపు
Tags:
HeritageOfIndia IndianArchaeology KakatiyaDynasty Mulugu NationalImportance Palampet TelanganaHeritage
Related News


