శ్రీవాణి వీపీ దర్శన టికెట్ల జారీ విధానంలో టీటీడీ పెద్ద మార్పు తీసుకొచ్చింది. జనవరి 9, 2026 నుంచి తిరుమల కౌంటర్ల ద్వారా జారీ చేసేవి 800 ఆఫ్లైన్ టికెట్లను రద్దు చేసి, ఆన్లైన్ కరెంట్ బుకింగ్లోకి మార్చారు (ట్రయల్ బేసిస్పై ఒక నెల).
కొత్త బుకింగ్ వివరాలుబుకింగ్ సమయం: ప్రతి రోజు ఉదయం 9:00 గంటలు నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు.
దర్శన రిపోర్టింగ్: అదే రోజు సాయంత్రం 4:00 గంటలకు తిరుమల.
టికెట్లు పరిమితి: ఒక లాగిన్కు 1+3 (మొత్తం 4 టికెట్లు). అదనపు: ఎయిర్పోర్ట్ ఆఫ్లైన్ కోటా (200 టికెట్లు) మార్పు లేదు. ముందుగా 500 ఆన్లైన్ టికెట్లు కూడా ఉన్నాయి.
ఈ ఫలితాల ఆధారంగా శ్రీవాణి దర్శన టైమింగ్స్ మరియు ప్రక్రియల్లో మరిన్ని మార్పులు తీసుకుంటారు. భక్తులు అధికారిక సైట్ ttdevasthanams.ap.gov.inలో చెక్ చేయాలి



