విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. అందరికీ ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత అవసరమని వైయస్ జగన్ పేర్కొన్నారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు.
విజయవాడ ఇఫ్తార్ విందులో వైయస్ జగన్
Related News



