Bharat Today: హైదరాబాద్ చైతన్యపురి ప్రాంతంలోని అష్టలక్ష్మి దేవాలయం లో సీతారాముల కళ్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సీతారాముల కళ్యాణం తిలకించి, స్వామివారి అనుగ్రహం పొందారు. శ్రీరామచంద్రుడి కృపతో దేశం సుభిక్షంగా ఉండాలని అందరూ ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాగమల్ల శ్రవణ్ కుమార్ , ప్రధాన కార్యదర్శి మేడం సుధాకర్ గుప్తా, ఫౌండర్ చైర్మన్ గౌరిశెట్టి చంద్రశేఖర్ , మాజీ చైర్మన్ సోమ సురేష్ కుమార్ , మాజీ చైర్మన్ బంధం దామోదర్, కోశాధికారి దాచేపల్లి శ్రీనివాస్ , మాజీ కోశాధికారి ఆయుత అంజయ్య, వైస్ చైర్మన్ వనం యాదయ్య , స్పెషల్ ఇన్వైటి చిలుక ఉపేందర్ రెడ్డి , సెక్రటరీలు కొక్కొండ చంద్రశేఖర్, గోవింద్ శ్రీనివాస్, బిక్కుమళ్ళ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



